ముఖ్యమైన అంశాలు
- డబ్బును దొంగిలించడానికి మోసగాళ్ళు నకిలీ UPI యాప్ల ద్వారా చెల్లింపు అభ్యర్థనలను పంపుతారు
- అపరిచిత వ్యక్తులతో ఎటువంటి ఆర్థిక లావాదేవీ లేదా సంభాషణలు చేయకుండా ఉండండి
- RBI ద్వారా గుర్తించబడిన, అధికారికంగా ధృవీకరించబడిన బ్యాంకింగ్ మరియు UPI యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయండి
పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీల కారణంగా, భారతదేశంలో ఇ-వాలెట్ మోసాలు మరియు ఆన్లైన్ చెల్లింపు మోసాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. ఇ-వాలెట్లు లేదా UPI యాప్లను ఉపయోగించేటప్పుడు ఆన్లైన్ చెల్లింపు మోసాలను నివారించడం చాలా ముఖ్యం. National Payments Corporation of India అందించిన డేటా ప్రకారం, ఫిబ్రవరి 2021 లో చేసిన మొత్తం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల సంఖ్య 2.29 బిలియన్లు. భారతదేశంలో UPI యాప్లు మరియు ఇ-వాలెట్ల ద్వారా చెల్లింపులు చేయడానికి ఎక్కువ మంది రిసార్ట్ చేస్తున్నందున, ఇది మరింత ఆన్లైన్ మోసం సంఘటనలకు మాత్రమే కారణమైంది.
మా సర్వీస్ పోర్టల్ను సందర్శించండి
E-వాలెట్ మరియు UPI యాప్ చెల్లింపు మోసాలు అంటే ఏమిటి?
నిజమైన మోసం లేదా గుర్తింపు దోపిడి
ఈ సమయంలోనే మోసగాళ్లు (స్కామర్లు) మీ అకౌంట్ నుండి డబ్బును దొంగిలించడానికి లేదా అనధికార కొనుగోళ్లు చేయడానికి మీ ఆర్థిక సమాచార యాక్సెస్ని పొందుతారు.
“మీ ‘E-వాలెట్ పేరు’ యొక్క KYCని పూర్తి చేయండి, లేదంటే మీ E-వాలెట్ అకౌంట్లోని డబ్బును కోల్పోతారు. దయచేసి 987******* నెంబరుకు కాల్ చేసి, వెంటనే చర్యలు తీసుకోండి.”
“UPI యాప్ ద్వారా లావాదేవీలు చేయడం కొనసాగించడానికి మీ సమాచారాన్ని అప్డేట్ చేయండి. www.upd8UPIinfo.com పై క్లిక్ చేయండి మరియు ధృవీకరణ వివరాలను పూర్తి చేయండి. 24 గంటల్లోపు చేయకపోతే, మీ అకౌంట్ డియాక్టివేట్ చేయబడుతుంది, మరియు మీరు తదుపరి ట్రాన్సాక్షన్లను నిర్వహించలేరు.”
ఇలాంటి మెసేజ్లు భయాందోళనకు గురిచేస్తాయి, డబ్బును కోల్పోతామన్న భయంతో ప్రజలు ధృవీకరించని లింక్లపై క్లిక్ చేయడం, అందులో ఇచ్చిన సూచనలను అనుసరించడం వంటి ఆలోచన లేని, అసంబద్ధ చర్యలు చేస్తారు. ఇవి నిర్లక్ష్యంగా ఉన్న కస్టమర్లను మోసం చేయడానికి నేరగాళ్లు ఉపయోగించే సాధారణ పద్ధతులు. మోసగాళ్లు UPI పిన్ లేదా OTP లేదా QR కోడ్ స్కాన్ అవసరమయ్యే చెల్లింపు అభ్యర్థనను వారి UPI యాప్ ద్వారా పంపుతారు, లేదా అనధికారికంగా ఫైనాన్షియల్ యాక్సెస్ పొందడానికి పలుమార్లు ఈ 'మీ వివరాలను అప్డేట్ చేయండి' అనే బెదిరింపులకు పాల్పడుతారు.
ఈ మోసాలు ఎలా జరుగుతాయి?
భారతదేశంలో ఆన్లైన్ చెల్లింపుల మోసాలు, ముఖ్యంగా E-వాలెట్ మోసాలు మరియు UPI యాప్ మోసాలు, సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త మార్గాలను మరియు కొత్త యంత్రాంగాలను రూపొందిస్తున్నందున ఇవి చాలా క్లిష్టంగా మారుతున్నాయి. ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేసే వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ, ప్రజల నుండి సున్నితమైన సమాచారాన్ని పొందడానికి దురుద్దేశపూర్వక వ్యక్తులు ఏ స్థాయికైనా దిగజారుతున్నారు. వారు ఈ కింది సాధారణ మార్గాలలో మోసాలు చేస్తారు:
1. ఫిషింగ్ కారణంగా నష్టాలు
మోసగాళ్లు టెక్స్ట్ (SMS) ద్వారా అనధికారిక చెల్లింపు లింక్లను పంపుతారు. ఈ నకిలీ బ్యాంక్ URLలు అసలు వెబ్సైట్ లింక్ను పోలి ఉంటాయి, దీని వలన ప్రజలు ఈ ట్రాప్ సులభంగా పడిపోయే అవకాశం ఉంది. ఒక్కసారి డబ్బును డెబిట్ చేయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత, మొత్తం E-వాలెట్ లేదా UPI యాప్ నుండి తక్షణమే ఉపసంహరించబడుతుంది.
2. నకిలీ బ్యాంక్ ఉద్యోగులు
మోసగాళ్లు బ్యాంక్ అధికారుల వలె నటించి, ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ స్క్రీన్కు రిమోట్ యాక్సెస్ పొందడానికి యాప్ను ఉపయోగించి ప్రజలను మోసం చేసి దోచుకుంటారు. ముందుగా, వారు డెబిట్ కార్డు బ్లాక్ అయిందనో లేదా KYC అప్డేట్ చేయబడలేదనో ఒక సాకు చెప్తారు, ఆపై ఆ అమాయకపు వ్యక్తికి దశలవారీగా మార్గనిర్దేశం చేసి, వారి ఫోన్లో ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోమని అడుగుతారు. స్క్రీన్ షేర్ చేయబడింది కాబట్టి, మోసగాడు బాధితుడు ఏమి చేస్తున్నాడో పర్యవేక్షిస్తూ, చివరికి ఫోన్ లేదా కంప్యూటర్పై నియంత్రణ సాధించి సమాచారాన్ని దొంగిలించగలుగుతారు.
3. తప్పుదారి పట్టించే UPI హ్యాండిల్స్
చాలా మంది నేరగాళ్లు @paymentsBHIM_best లేదా @disputesNPCI వంటి సరైన పేరుతో UPI హ్యాండిల్స్ను సృష్టిస్తారు. NPCI లేదా BHIM వంటి పదాలు ఉండటం వలన, ప్రజలు ఈ హ్యాండిల్స్ను ప్రామాణికమైనవి మరియు అధికారికమైనవి అని విశ్వసించి, మోసపోతారు. నేరగాళ్లు మిమ్మల్ని ఒక నకిలీ UPI యాప్ ద్వారా మీ అకౌంట్ వివరాలను బహిర్గతం చేసేలా చేసి, ఆపై ఆ అకౌంట్స్ హ్యాక్ చేస్తారు.
4. OTP, పిన్, UPI మోసాలు
UPI యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసే సమయంలో OTP లేదా UPI పిన్ అవసరం. ఆ రెండింటిలో ఏదో ఒకటి ధృవీకరించబడిన వెంటనే, ట్రాన్సాక్షన్ విజయవంతమవుతుంది. ఈ విధంగా ప్రజలను మోసం చేయడం నేరగాళ్లకు అత్యంత ఇష్టమైన మార్గాలలో ఒకటి. నేరగాళ్లకు ఫోన్లో UPI పిన్ లేదా OTPని తమతో షేర్ చేసుకునేలా ప్రజలను ఒప్పించే నైపుణ్యం ఉంటుంది మరియు దాని ద్వారా వారు ట్రాన్సాక్షన్స్ ధృవీకరించి, డబ్బును దొంగిలించవచ్చు. చట్టబద్ధమైన బ్యాంకులు ఈ సమాచారం కోసం అడగడానికి ఎప్పుడూ కాల్ చేయవు అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
ఎలా సురక్షితంగా ఉండాలి?
E-వాలెట్లు మరియు UPIని ఉపయోగించేటప్పుడు ఆన్లైన్ చెల్లింపు మోసాన్ని నిరోధించడానికి అనుసరించవలసిన కొన్ని చిట్కాలు మరియు జాగ్రత్తలు ఉన్నాయి. వీటిలో ఈ క్రిందివి ఉంటాయి:
తెలియని వ్యక్తులతో ఎలాంటి సంభాషణలు చేయరాదు
మొదటి మరియు ముఖ్యమైన దశ ఏమిటంటే, ఆన్లైన్లో తెలియని వ్యక్తులను సంప్రదించకూడదు - అది టెక్స్ట్, ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా అయినా. లోన్, క్రెడిట్ కార్డ్ విక్రయించడానికి బదులుగా లేదా KYC వివరాలను అప్డేట్ చేయడానికి బజాజ్ ఫైనాన్స్ వంటి ప్రఖ్యాత కంపెనీల అధికారుల వలె నటిస్తారు. బజాజ్ ఫైనాన్స్ లేదా ఏదైనా ఇతర చట్టపరమైన బ్యాంక్ UPI PIN లేదా OTP వంటి ఆర్థిక, వ్యక్తిగత లేదా లావాదేవీ వివరాలను బహిర్గతం చేయమని మిమ్మల్ని ఎప్పుడూ అడగదు అని గుర్తుంచుకోండి.
ఒకవేళ మీరు అపరిచితుల నుండి ఏదైనా కాల్ అందుకుంటే, వారు ఏ సంస్థ పేరుతో మాట్లాడుతున్నారో ఆ సంస్థను నేరుగా సంప్రదించి, వారు చెప్పిన విషయాలను పూర్తిగా ధృవీకరించండి. వారి ట్రిక్కుల్లో చిక్కుకోకుండా ఉండటానికి గుర్తు తెలియని ఇమెయిల్ చిరునామాకు లేదా తెలియని ఫోన్ నంబర్కు అసలు బదులివ్వకుండా ఉండడం మరీ మంచిది.
OTPని ఎవరితోనూ షేర్ చేయవద్దు
ట్రాన్సాక్షన్లు ధృవీకరించడానికి బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు వన్-టైమ్ పాస్వర్డ్లను (OTPలు) ఉపయోగిస్తాయి, అయితే దురదృష్టవశాత్తు, ఇవి ఆన్లైన్లో మోసపూరిత కార్యకలాపాలకు ప్రధాన ప్రవేశ ద్వారాలుగా మారాయి.
బజాజ్ ఫైనాన్స్ లేదా దాని ప్రతినిధులు ఏ ట్రాన్సాక్షన్ను ప్రాసెస్ చేయడానికి PIN లేదా OTP కోసం ఎప్పుడూ అడగరు. మీ PIN లేదా OTP షేర్ చేయడం మోసానికి దారితీయవచ్చు మరియు మీరు ఏ పరిస్థితుల్లోనూ అటువంటి వివరాలను షేర్ చేయకూడదు.
తెలియని లింకులపై క్లిక్ చేయడం లేదా చెల్లింపు అభ్యర్థనలను అంగీకరించడం వాటి నుంచి దూరంగా ఉండండి. నకిలీ వ్యక్తులు అనైతికంగా డబ్బు సంపాదించడానికి అసలు లింక్ల వలె కనిపించే నకిలీ లింక్లను తరచుగా పంపుతుంటారు. మీరే స్వయంగా చెల్లింపు చేయనంత వరకు, ఎవరైనా పంపిన పేమెంట్ లింక్పై క్లిక్ చేసి, చెల్లింపును కొనసాగించకూడదు. ముఖ్యంగా, మీరు డబ్బు పొందుతున్నట్లయితే, మీరు మీ UPI పిన్ని షేర్ చేయాల్సిన అవసరం లేదు.
మోసపూరిత/ నకిలీ యాప్స్ ఇన్స్టాల్ చేయవద్దు
Android మరియు Apple వంటి ఆపరేటింగ్ సిస్టమ్లు వారి యాప్ స్టోర్ల నుండి నకిలీ మరియు మోసపూరిత యాప్లను తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఇన్స్టాల్ చేయకూడని నకిలీ UPI యాప్లను ఇప్పటికీ మీరు గమనించవచ్చు. ఆర్థిక నేరగాళ్ళు మీకు ఆర్థిక సేవలను అందించేవారి పేరును పోలిన పేరును ఉపయోగించి, మిమ్మల్ని ఆ యాప్ ఇన్స్టాల్ చేసేలా ప్రేరేపించడానికి ప్రయత్నిస్తారు. UPI యాప్ లేదా E-వాలెట్ యొక్క చట్టబద్ధతను ధృవీకరించడానికి డెవలపర్, రిజిస్టర్డ్ వెబ్సైట్ మరియు అలాంటి ఇతర సమాచారాన్ని ఎల్లప్పుడూ చెక్ చేస్తూ ఉండండి.
సమస్యలలో ఉన్నప్పుడు, అధికారిక హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించండి
కొన్నిసార్లు మీరు ఇంటర్నెట్లో ఒక నంబర్ను గూగుల్ చేసినప్పుడు, ఆ సమయంలో సరైన, ఖచ్చితమైన సమాచారాన్ని పొందకపోవచ్చు. నేరగాళ్లు కంపెనీ పేరుతో చట్టబద్ధంగా కనిపించే twitter హెల్ప్లైన్ హ్యాండిల్స్ను మరియు ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్ను కూడా సృష్టించారు. వారు మీతో కమ్యూనికేట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. మీరు నిరాశలో ఉన్నప్పటికీ అటువంటి హ్యాండిల్స్తో కమ్యూనికేట్ చేయకండి. అధికారిక వెబ్సైట్కు వెళ్లి, అక్కడ పొందుపరచిన కస్టమర్ కేర్ లేదా హెల్ప్లైన్ నంబర్లను సేకరించి, వాటికి కాల్ చేయండి.
అన్ని UPI యాప్స్ మరియు ఇ-వాలెట్లు వారి వెబ్సైట్లలో ప్రత్యేకమైన కస్టమర్ సపోర్ట్ హెల్ప్లైన్ నంబర్లను జాబితా చేశాయి. అదే విధంగా బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు వంటి ఆర్థిక ప్రొవైడర్లు ఏవైనా మోసపూరిత కార్యకలాపాలను నివేదించడానికి వారి వెబ్సైట్లలో పేర్కొన్న సర్టిఫైడ్ హెల్ప్లైన్ నంబర్లు మరియు సోషల్ మీడియా అకౌంట్లను కూడా కలిగి ఉంటారు.
సైబర్ నేరాలను రిపోర్ట్ చేయకుండా ప్రజలు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు, కానీ మీరు తప్పనిసరిగా ఫిర్యాదును నమోదు చేయాలి మరియు ఆన్లైన్ మోసాన్ని మరియు పలు సంఘటనలను రిపోర్ట్ చేయడానికి జాతీయ హెల్ప్లైన్ నంబర్ - 155260 కు కాల్ చేయాలి. మీ అనుభవం నుండి ప్రజలు ఎంతో నేర్చుకోవచ్చు.
అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి.